రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం, 30 మందికి తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు.. రెండు లారీలతో పాటు పలు వాహనాలను బలంగా ఢీకొట్టింది.

Update: 2024-09-13 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు.. రెండు లారీలతో పాటు పలు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బంగారుపాలెం మండలం మొగలిఘాట్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. సహయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News