మిస్టరీగా దుర్గాప్రశాంతి మర్డర్ కేసు

కొండమిట్ట ప్రాంతంలో ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ప్రశాంతి అనే యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Update: 2023-04-19 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా వేలూరు రోడ్డులోని కొండమిట్ట ప్రాంతంలో ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ప్రశాంతి అనే యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే బ్యూటిషియన్ హత్య కేసు మిస్టరీగా మారింది. ఫేస్ బుక్ పరిచయమే దుర్గను బలి తీసుకుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ పరిచయంతో 2 నెలల క్రితం చిత్తూరుకు నిందితుడు చక్రవర్తి వచ్చాడు. యువతిని గొంతు నులిమి చంపి ఆపై కత్తితో పొడుచుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చక్రవర్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. చక్రవర్తి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చక్రవర్తి తల్లి ప్రమీల, స్నేహితుడు శశికుమార్ లను పోలీసులు విచారిస్తున్నారు. 

Tags:    

Similar News