చంద్రబాబును విడిచిపెట్టం... పిడికిలి బిగిస్తాం: సీదిరి అప్పలరాజు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను అవమానించారు అని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.

Update: 2023-11-26 05:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను అవమానించారు అని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. సామాజిక సాధికార బస్సు యాత్రతో ఎక్కడకు వెళ్లిన ప్రజలు స్వాగతిస్తున్నారని.. ప్రజల నుంచి సంపూర్ణ ఆదరణ లభిస్తుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఏనాడూ బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలను ఘోరంగా అవమానించారని అన్నారు. మత్స్యకారులను తోలుతీస్తానన్నాడు. నాయీబ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖరాసిన ఘనుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబును విడిచిపెట్టం. పిడికిలి బిగిద్దాం. నడుం కడదాం. బాబు శాశ్వతంగా రాజకీయాల్లోంచి విరమించేదాకా విశ్రమించం అని మంత్రి సీదిరి అప్పలరాజు శపథం చేశారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు నాయుడు ఘోరంగా అవమానించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ముస్లిం మైనార్టీలకు తన కేబినెట్‌లో ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. నేడు జగనన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఈబీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలిచ్చారు అని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. చంద్రబాబు దగ్గర బానిసత్వం చేస్తున్న యనమల రామకృష్ణుడు....బీసీల్ని అవమానిస్తే అడగలేదని చెప్పుకొచ్చారు. అప్పుడూ అదే బడ్జెట్, ఇప్పుడూ అదే బడ్జెట్, ప్రతి ఇంటికీ లక్షల రూపాయలు జగనన్న సాయం చేశారు. చంద్రబాబు చేయగలిగాడా? ప్రజలు ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో 31 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది అని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రూ.5 లక్షలతో సీసీ రోడ్డు వేసి అభివృద్ధి అని టీడీపీ అంటే.. కోటి రూపాయలతో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌లు కట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు.

Tags:    

Similar News