Attack : దంపతుల మధ్య వివాదం.. ఆపేందుకు వచ్చిన కానిస్టేబుల్‌పై దాడి

విశాఖ చిన వాల్తేరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-07-30 04:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ చిన వాల్తేరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గొడవ పడుతున్న దంపతులను వారించిన కానిస్టేబుల్‌పై భర్త దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరిని ప్రశ్నించాడు. అయితే మద్యం మత్తులో ఉన్న వినయ్ అనే వ్యక్తి రాజులనాయుడు అనే కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. వినయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News