దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన సీఎం జగన్‌‌పైనే చర్చ: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు.

Update: 2023-11-22 12:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం ఒక సంచలనం అని అభివర్ణించారు. కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలను దేశమంతా మెచ్చుకుంటుందని చెప్పుకొచ్చారు. దేశచరిత్రలో సీఎం వైఎస్ జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా సీఎం వైఎస్ జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. వైఎస్ జగన్ పాలనలో పూరి గుడిసెల్లో ఉండేవాళ్లు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని చెప్పుకొచ్చారు. విద్యావ్యవస్థలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో విద్యార్థుల తలరాతలు మారిపోతున్నాయని.. వారి జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపుతున్నారని అన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసినా మన రాష్ట్రానికి చెందిన ఉద్యోగులే కనిపిస్తున్నారని అందుకు వైఎస్ జగన్ నిర్ణయాలే కారణమన్నారు. గత పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే సీఎం వైఎస్ జగన్ మాత్రం తమకు ఎంతో గుర్తింపు నిచ్చారని ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News