Pawan Kalyan: మహిళలకు పసుపు కుంకుమ కానుకగా నేడు చీరలు పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం..!

నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

Update: 2024-08-30 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అయితే ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను అందజేయనున్నారు.

Tags:    

Similar News