రెస్టారెంట్ మీదికి ఎగబడ్డ జనం.. ఇంతకీ ఏమైంది?

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ రెస్టారెంట్ మీదకి 2 వేల మంది జనం ఒకేసారి ఎగబడ్డారు.

Update: 2024-08-08 14:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ రెస్టారెంట్ మీదకి 2 వేల మంది జనం ఒకేసారి ఎగబడ్డారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. పట్టణంలో ఓ రెస్టారెంట్ ను నూతనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా చికెన్ బిర్యానీ కేవలం రెండు రూపాయాలకే అని ప్రకటన ఇచ్చారు నిర్వహకులు. ఈ వార్త పట్టణంలో దావానంలా వ్యాపించడంతో రెండు రూపాయల బిర్యానీ కోసం ఏకంగా 2 వేల మంది ఒకేసారి ఎగబడ్డారు. కాని నిర్వహకులు ఆఫర్ కింద కేవలం 200 ప్యాకెట్ల బిర్యానిని మాత్రమే సిద్దం చేయడంతో, అక్కడ తొక్కిసలాట జరిగి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అందరినీ చెదరగొట్టి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. మరోసారి ప్రజలను ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తే కేసు నమోదు చేయాల్సి వస్తుందని రెస్టారెంట్ నిర్వహకులను హెచ్చరించారు పోలీసులు. 


Similar News