AP:వివాదస్పదంగా మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడి ప్రమోషన్?

ఏపీలో ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడు ప్రమోషన్ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది

Update: 2024-08-31 08:04 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడు ప్రమోషన్ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. నేటితో ఆయన రిటైర్ కానుండగా నిన్న డీఎస్‌పీ నుంచి ఏఏస్‌పీగా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో నిబంధనలు తుంగలో తొక్కి ఆయనకు ప్రమోషన్ కల్పించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆయన ఒక్కరి కోసం 32 మందికి ఏఎస్‌పీలుగా ప్రమోషన్ ఇచ్చారని విమర్శిస్తోంది. వీరంతా ఏఎస్‌పీలుగా రిటైరైతే ఖజానా పై అనవసర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.


Similar News