TTD: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో రుద్రహోమం ప్రారంభం
ఈ హోమం నెల రోజుల పాటు జరగనుంది.
దిశ,వెబ్ డెస్క్: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రహోమం) శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ హోమం నెల రోజుల పాటు జరగనుంది. హోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన, హారతి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.