ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

రాష్ట్రంలో ఘోర ప్రమాదం(fatal accident) చోటుచేసుకుంది.

Update: 2024-10-23 03:56 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర ప్రమాదం(fatal accident) చోటుచేసుకుంది. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు(RTC Bus) లోయలో పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే. కదిరి నుంచి బయలుదేరిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు(RTC Bus) వైఎస్సార్ జిల్లా(YSR District) పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడింది. దీంతో బస్సులో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ క్రమంలో క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News