AP:రుషికొండ భవనాలపై త్వరలో సీఎం నిర్ణయం..మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు.

Update: 2024-08-27 07:04 GMT

దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. నేడు(మంగళవారం) విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన ఉండదని, అదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో డంపింగ్ యార్డును పరిశీలించారు. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణంపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను ఏం చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


Similar News