Jr. NTR:జూ.ఎన్టీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ ప్రత్యేక అభినందనలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Update: 2024-09-03 13:27 GMT

దిశ,వెబ్‌డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన ఈ విరాళాన్ని అందజేయనున్నారు. వరద బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించిన తారక్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. విరాళం అందించిన మరో హీరో విశ్వక్ సేన్‌కు కూడా సీఎం రేవంత్, లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.


Similar News