YS Jagan Mohan Reddy : రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు.

Update: 2023-10-20 11:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం చేరుకుంటారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. చివరగా పోలీస్‌ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అక్కడ గవర్నర్‌ను కలిసిన అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుంటారు. అక్కడ ఏపీ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నాం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

Tags:    

Similar News