నటుడు అలీకి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్

Update: 2022-02-10 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హాస్య నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పినట్లు సమాచారం. త్వరలోనే యాక్టర్ అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో వార్తలు హల్‌‌చల్ చేస్తు్న్నాయి. ఈ మేరకు గురువారం సినీ ఇండస్ట్రీ పెద్దలతో టికెట్ల వివాదంపై జరిపిన చర్చల అనంతరం స్వయంగా సీఎం జగన్ అలీకి హామీ ఇచ్చి, మరో వారంలో కలుద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, జులైలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒక రాజ్యసభ స్థానాన్ని మైనార్టీకి ఇస్తారని ముందునుంచి ప్రచారం జరిగింది.

Tags:    

Similar News