రజనీకాంత్‌పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న విమర్శలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు

Update: 2023-05-01 07:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న విమర్శలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అని అన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు. ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి, జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’ అని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

Read More:   రజినీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌‌ల‌ను విమర్శించడం కరెక్ట్ కాదు: Chandra Babu

Tags:    

Similar News