Ap Assembly వేదికగా పింఛన్‌దారులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్న సీఎం జగన్ (Cm Jagan) అసెంబ్లీలో తెలిపారు...

Update: 2023-03-15 11:09 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నట్లు సీఎం జగన్ (Cm Jagan) అసెంబ్లీలో తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు (Ap Assembly Budget Sesstion 2023-2024) కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ రూ. 2,250 నుంచి 2,750 వరకు పింఛన్ (Penstion) పెంచామని ఆయన తెలిపారు. వచ్చే జనవరి నుంచి 3 వేల రూపాయలకు పెంచబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నంత పింఛన్ ప్రపంచంలోనే ఎక్కడా లేదని సీఎం జగన్ తెలిపారు.

ఏపీలాంటి రేషన్ విధంగా ఎక్కడా లేదు...

రాష్ట్రంలో కోటి 46 లక్షలకు రేషన్ కార్డులు (Ration Cards) పెంచామన్నారు. ఏపీ లాంటి రేషనింగ్ పాలసీ కూడా దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందిస్తున్నామన్నారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాసులు (Digital Classes) ప్రారంభిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News