CM Chandrababu:నేడు పీఎం మోడీ ఇలాకాలో సీఎం చంద్రబాబు పర్యటన.. కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(సోమవారం) ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కు (Gujarat) వెళ్లారు.
దిశ,వెబ్డెస్క్:ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(సోమవారం) ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కు (Gujarat) వెళ్లారు. ఈ క్రమంలో గుజరాత్లోని గాంధీ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గాంధీ నగర్లో (Gandhi Nagar) ఈ రోజు నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ – 2024(Renewable Energy Investors Meet – in 2024)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.
రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఈ సదస్సులో చంద్రబాబు వివరించనున్నారు. ఎనర్జీ రంగంలో పేరు ప్రఖ్యాతులు (Famous people) ఉన్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి(International level) సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ హాజరవుతున్నందున ఆయనతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని సమాచారం. అనంతరం రాత్రి 9 గంటలకు చంద్రబాబు అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నారు.