Good News:యువతకు సీఎం చంద్రబాబు భారీ కానుక..భారీ జీతంతో ఉద్యోగాలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం యువతకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే చంద్రబాబు సర్కార్ మంత్రుల పేషీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిశ,వెబ్డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం యువతకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే చంద్రబాబు సర్కార్ మంత్రుల పేషీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పేషీల్లోకి కొత్తగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్(Social Media Executive), సోషల్ మీడియా అసిస్టెంట్లను(Social Media Assistant) తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) ప్రకటన విడుదల చేసింది. 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించబోతున్నట్లు తెలిపారు. వీరిని అవుట్సోర్సింగ్/ తాత్కాలిక విధానంలో మంత్రులు పేషీల్లోకి తీసుకుంటారు.
ప్రభుత్వం సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి విద్యార్హతను బీఈ/బీటెక్గా నిర్ణయించింది. ఈ జాబ్లో సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.50 వేల జీతం ఇస్తారు. అదే సోషల్ మీడియా అసిస్టెంట్కి ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులుగా నిర్ణయించింది. వీరి జీతం నెలకు రూ.30 వేలుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీలోగా తమ రెజ్యూమ్ info.apdcl@gmail.com మెయిల్ కు పంపించాలి. హాట్ సూట్ పై పనిచేసిన అనుభవంతోపాటు గూగుల్ అనలిటిక్స్, ఫేస్ బుక్, డిజిటల్ బ్లాగర్ ఫ్లాన్, ఫ్రీలాన్స్ లాంటి అనుభవం ఉండాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.apdc.ap.gov.in/ , I&PR వెబ్సైట్ http://ipr.ap.gov.in/ ను సంప్రదించండి.