Nara Chandrababu Naidu : జేసీబీ ఎక్కి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం

పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో ఏలేరు కాలువ ముంపు ప్రాంతాలను, పరిశీలించి రైతులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

Update: 2024-09-11 10:42 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ:పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో ఏలేరు కాలువ ముంపు ప్రాంతాలను, పరిశీలించి రైతులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం లో జేసీబీ పై ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు , రైతులతో మాట్లాడారు. వరద బాధితుల నష్టాన్ని గురించి వారి నుంచి వివరాలు, సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇచ్చారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలతో ముఖ్యమంత్రి మమేకం అవ్వడం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

వరద బాధితులను పరామర్శించేందుకు సామర్లకోట నుండి కిర్లంపూడి మండలం రాజుపాలెం కు బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని సామర్లకోట జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబు కు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిరాజు, యనమల దివ్య, వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు.


Similar News