హైదరాబాద్-అమరావతి హైవేపై కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు చర్చలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-07-04 10:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో నేడు(గురువారం) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. ఈ క్రమంలో అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేల నిర్మాణం త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు సమాచారం. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహనాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Similar News