హర్యానాలో బీజేపీ చారిత్రాత్మక విజయంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు

హర్యానా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఉహించని విధంగా అధికార బీజేపీ మూడో సారి విజయకేతనం ఎగురవేసింది.

Update: 2024-10-09 12:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఉహించని విధంగా అధికార బీజేపీ మూడో సారి విజయకేతనం ఎగురవేసింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికి గతంలో కంటే 8 స్థానాలను అధికంగా గెలుచుకొని రాజకీయ విశ్లేకులతో పాటు, సర్వే సంస్థలను షాక్ కు గురి చేసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మూడోసారి విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది. కాగా హర్యానాలో చారిత్రాత్మక ఎన్నికల్లో విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "హర్యానాలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, జమ్మూకశ్మీర్‌లో మంచి పనితీరు కనబరిచినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతున్నాను. విశ్వసనీయత కలిగిన నాయకుడు మంచి పనితీరు కనబరిచినప్పుడల్లా ప్రజలు ఆదరిస్తారనడానికి ఇదే ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్‌లో కూడా, ప్రభుత్వంలో స్థిరత్వం ఏర్పడినప్పుడల్లా అభివృద్ధి చెందుతుంది. అది సంపద సృష్టి ద్వారా మాత్రమే అన్ని సమస్యలు తొలగుతాయి. ఇదే మేము NDA తరపున ప్రధాని మోడీ విధానాలకు మద్దతు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.


Similar News