వరద ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక తనిఖీలు.. అధికారుల పరుగులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ భారీ వర్షాల కారణంగా జలమయం అయింది.

Update: 2024-09-02 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ భారీ వర్షాల కారణంగా జలమయం అయింది. దీంతో రెండు రోజులుగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వరద ప్రభావిత బాధితులను పరామర్శించిన సీఎం.. కొద్దిసేపటికే మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలు నచ్చకపోవడంతో క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయలు దేరాడు. దీంతో సీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేకుండా సీఎం పర్యటనకు వస్తుండటంతో అధికారులు ఉరుకులు పెడుతున్నారు. కాగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. ఓ వైపు కృష్ణ.. మరోవైపు బుడమేరు ఉప్పొంగడంతో బెజవాడ పట్టణంలోని అనేక కాలనీలు నీటిలో మునిగి పోయిన సంగతి తెలిసిందే.


Similar News