AP:సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన రద్దు ..కారణం ఇదే!
ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం నేడు(శుక్రవారం) పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారనే విషయం తెలిసిందే.
దిశ,వెబ్డెస్క్:ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం నేడు(శుక్రవారం) పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారనే విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పర్యటన రద్దు అయింది. పల్నాడు ప్రాంతంలో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా సభా ప్రాంగణం బురదమయం కావడంతో ముందు జాగ్రత్తగా అధికారులు పర్యటనను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం కాకాని JNTU కాలేజీలో జరిగే కార్యక్రమానికి వీరిద్దరూ హాజరు కావాల్సి ఉంది. అటు మరోచోట కార్యక్రమం నిర్వహణకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మంగళగిరి, లేదా పేరేచర్ల ప్రాంతంలో వనమహోత్సవం నిర్వహించాలన్న ఆలోచనలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది.