మంగళగిరిలో వనమహోత్సవం..హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం
మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దిశ, డైనమిక్ బ్యూరో:మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత నరసరావుపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా వర్షం కారణంగా వాయిదా పడింది. దీంతో ఎకో పార్క్కు వనమహోత్సవానకి పర్యటనను మార్పు చేశారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎకో పార్క్ కి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, స్వాగతం పలికారు. పార్క్లో కలియ తిరుగుతూ మొక్కలు, చెట్ల గురించి ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. హరితాంధ్ర కోసం అడుగులు వేద్దామని, మొక్కలు నాటుదాం అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్తో కరచాలనం చేసేందుకు మహిళలు ఆసక్తి చూపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి మొక్కలకు నీరు పోశారు.