రోడ్డుపై గుంతలు పూడ్చిన సీఐ!

మడకశిర పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ పెనుగొండ రోడ్డులో ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు పడడంతో రోడ్డుపై ప్రయాణం వాహన చోదకులకు , బాటసారులకు నరకప్రాయంగా మారింది.

Update: 2024-10-06 14:13 GMT

దిశ,మడకశిర: మడకశిర పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ పెనుగొండ రోడ్డులో ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు పడడంతో రోడ్డుపై ప్రయాణం వాహన చోదకులకు , బాటసారులకు నరకప్రాయంగా మారింది. దీంతో రోడ్డుపై తరచూ ప్రమాదాలకు ద్విచక్ర వాహనదారులు గురై గాయాలపాలవుతున్నారు. ఈ విషయంపై మడకశిర రూరల్ సీఐ రాజ్ కుమార్ దృష్టి సారించి పట్టణంలోని కాంట్రాక్టర్‌తో కలిసి ట్రాక్టర్ల ద్వారా జెల్లీ సిమెంట్ ను తెప్పించి గుంతలు పడిన చోట రోడ్డుపై జెల్లీ, సిమెంటును కలిపి ఆదివారం గుంతలను పూడ్చారు. రోడ్డుపై గుంతలను పూడ్పించిన రూరల్ సీఐ ,రాజకుమార్‌ కు వాహనదారులు, స్థానికులు అభినందనలు తెలిపారు. సీఐ రాజకుమార్ సామాజిక స్పూర్తికి మడకశిర నియోజకవర్గ ప్రజలు సెల్యూట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.


Similar News