Third party appలో పెట్టుబడి.. ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది...

Update: 2023-01-13 13:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన విద్యార్థి ఇంద్రసేనారెడ్డి కాలేజీ హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంద్రసేనా రెడ్డి నాల్గోవ సంవత్సరం మెకానికల్ చదువుతున్నాడు. అయితే థర్డ్ పార్టీ యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయానని, అందుకే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మన్నూరు పోలీసులు విచారణ చేపట్టారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇంద్రసేనారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతితో ఇంజనీరింగ్ కాలేజీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు అందర్నీ కన్నీటిపర్యంతం చేసింది.


Similar News