సొంత ఇలాఖాలో సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి తన సొంత నియోకవర్గం పులివెందులలో పలు

Update: 2022-12-24 08:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి తన సొంత నియోకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఇడుపులపాలయలోని దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తండ్రి సమాధివద్ద ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నుంచి పులివెందుల భాకరాపురం హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత విజయ హోమ్స్‌ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభించారు. అలాగే కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

Tags:    

Similar News