తలసరి ఆదాయంలో తెలంగాణా టాప్​.. గతంలో మేం చూపిన చొరవ వల్లే.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు

దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని.. గతంలో తాను చూపించిన చొరవ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Update: 2025-03-17 08:04 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో:   అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని.. గతంలో తాను చూపించిన చొరవ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజన్​ 2047 డాక్యుమెంట్​పై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో తాను చూపించిన విజన్​వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందన్నారు. వికసిత్​భారత్​2047 కల్లా దేశం 30 ట్రిలియన్​డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. తలసరి ఆదాయం 18 వేల డాలర్లు ఉండాలన్నారు. నియోజకవర్గ విజన్​డాక్యుమెంట్​ను అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు. ఎమ్మెల్యేలకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలన్నారు. ఆ సమయానికి 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలన్నారు. 

Tags:    

Similar News