AP News:మందుబాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-08-30 09:32 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. లిక్కర్ పాలసీ పై కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో 2019 కంటే ముందున్న తరహా విధానాన్నే మళ్లీ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తరహా మద్యం విధానమే అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. కావున తెలంగాణలో ప్రజెంట్ అమలవుతున్న విధానాన్ని కొన్ని మార్పులు చేసి ఏపీలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించనుండగా, దరఖాస్తులకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు విధించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం విధానం పై కమిటీ అధ్యయనం చేసింది. సెప్టెంబర్‌లో మద్యం విధానం ఖరారుతో సాటే దరఖాస్తుల స్వీకరించి లైసెన్సులు అందజేసి అవకాశముంది. అక్టోబరు 1వ తేదీ నుంచి కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది.


Similar News