గుంటూరు ఎస్పీకి కేంద్రమంత్రి పెమ్మసాని కీలక ఆదేశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైసీపీ టీడీపీ పార్టీ శ్రేణుల మధ్య గొడవ సద్దుమణగడం లేదు.

Update: 2024-06-26 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైసీపీ టీడీపీ పార్టీ శ్రేణుల మధ్య గొడవ సద్దుమణగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా, గుంటూరు ఎస్పీ తుషార్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం ఫోన్ చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ శ్రేణులపై చర్యలకు కేంద్రమంత్రి పెమ్మసాని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించాలని ఎస్పీ తుషార్‌ను కేంద్ర మంత్రి పెమ్మసాని కోరారు. గాయాలైన టీడీపీ కార్యకర్తలకు సరైన వైద్యం అందించాలని పెమ్మసాని ఆదేశాలు జారీ చేశారు.    


Similar News