ఐదేళ్లలో దేవాలయాలను భ్రష్టు పట్టించిన వైసీపీ: కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు

Update: 2024-10-14 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రంలోని దేవాలయాలను భ్రష్టు పట్టించిందని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇంట్లో ఓ మతం, ఇంటి బయట మరో మతం గురించి మాట్లాడే నాయకులు ఎవరైనా సరే వాళ్లని నమ్మొద్దని అన్నారు. అనంతరం రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటన గురించి ప్రస్తావిస్తూ.. విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని, విగ్రహం పునర్నిర్మాణం కోసం విరాళాలు ఇస్తే వాటిని తిరిగి వెనక్కి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామతీర్థంలో ఏం జరిగింది?

ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని 2020 డిసెంబర్‌లో ధ్వంసం చేశారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. అధికార వైసీపీపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. బీజేపీ ధర్నాకు దిగింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసిన డీజీ సునీల్ కుమార్ కూడా అప్పట్లో ఎవరో ఆలయం గురించి తెలిసిన వ్యక్తులే పక్కా ప్లాన్ ప్రకారం.. రంపంతో దేవతా మూర్తి తలను కట్ చేశారని చెప్పడంతో కలకలం రేగింది. అనంతరం రెండేళ్ల తర్వాత 2022లో విగ్రహాలను మళ్లీ ప్రతిష్ఠించారు. 

Similar News