Bus Accident: పల్లె వెలుగు బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-09-07 07:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా, బత్తలపల్లి మండలంలో గల గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గాయాలైన ప్రయాణికులను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Similar News