ఆ పిచ్చికుక్కల్ని వదలం.. కొడాలినాని, వంశీకి బుద్ధా వెంకన్న మాస్ వార్నింగ్

టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-06-06 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు జన్మలెత్తిన తరగని శిక్ష జగన్మోహన్ రెడ్డికి పడిందన్నారు. ఇక జగన్ జీవితం జైలులోనే గడపాలన్నారు. కృష్ణా జిల్లాలో ఆ పిచ్చికుక్కల్ని వదిలే ప్రసక్తే లేదని కొడాలి నాని, వంశీలను ఉద్దేశించి అన్నారు. అరేయ్ కొడాలి నాని, వంశీ 2024లోనే తనను చంపేయాలని లేదంటే తాను వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. తాము అధికారంలో లేనప్పుడు కూడా ఇదే మాట చెప్పానని బుద్ధా వెంకన్న క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సతీమణిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినప్పుడే వాళ్లిద్దరి ఓటమి ఖరారైందన్నారు. 


Similar News