BREAKING: ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికే స్ఫూర్తి : జనసేన అధినేత పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-11 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ జరిగిన కూటమి శాసన సభాపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అంటే ఎలా ఉండాలో ఎపీ ప్రజలు దేశానికి చూపించారని తెలిపారు. ఐదేళ్ల కాలంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, కావాల్సిన చోట తగ్గమాని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు విపత్కర పరిస్థితులు చూశారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ ప్రజలకు ఎంతగానో నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిలోని అందరి పోరాటం వల్లే అద్భుత విజయం సాధించామని పేర్కొన్నారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది ఏమాత్రం సమయం కాదని పవన్ అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివొద్దని నాయకులకు సూచించారు. ప్రభుత్వం పరంగా అందరూ సమష్టిగా అభివృద్ధి కోసం నిలబడదాం అంటూ పవన్ ప్రసంగించారు.      


Similar News