BREAKING: మంత్రివర్గంపై కూటమి నేతల మంతనాలు.. హరిరామ జోగయ్య కీలక లేఖ

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు సమయం ఆసన్నమైంది.

Update: 2024-06-11 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే మంగళవారం కూటమి నేతలపై చంద్రబాబు సమావేశం కానున్నారు. అయితే, కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక పదివిని జనసేన అధినేత వపన్ కల్యాణ్‌కు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా జనసేన నుంచి ముగ్గురు లేదా నలుగురు, బీజేపీ నుంచి మరో ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాపు, బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూటమి నేతలకు లేఖ రాశారు. రాష్ట్రంలో కూటమి పాలన పాదర్శకంగా ఉండాలని కోరారు. ఉచితాలు కాకుండా.. అవసరాలు తీర్చేలా సంక్షేమ పథకాలు ఉండాలని అన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలని సూచించారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని హరిరామ జగయ్య విజ్ఞప్తి చేశారు.


Similar News