AP:గుడ్లవల్లేరు కాలేజీ ఘటన పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది.

Update: 2024-08-31 13:46 GMT

దిశ,వెబ్‌డెస్క్:గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ ఘటన పై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశం పై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలి అని బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుందని హెచ్చరించారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో వాస్తవాలను ప్రభుత్వం బయటపెట్టాలి. ఎవడు వేధవైతే వాడిని తప్పకుండా శిక్షించాలని అడుగుతున్నామని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా చర్యలు ఉండాలి అని తెలిపారు.


Similar News