అధికార పార్టీకి బిగ్ షాక్ : చంద్రబాబును కలవనున్న వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు నెలకొంటున్నాయి.

Update: 2024-01-11 16:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు నెలకొంటున్నాయి. సీఎం తనకు పెనమలూరు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే పార్థసారథి తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని రేపు కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో పార్థసారథి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పెనమలూరు లేదా నూజివీడు నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో టీడీపీలో పార్థసారథి చేరిక అంశం రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.  

Tags:    

Similar News