ఎన్నికలవేళ జనసేనకు బిగ్ షాక్: వైసీపీలోకి కీలక నేత

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.

Update: 2023-12-18 11:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో యడ్లపల్లి రామ్ సుధీర్ తన అనుచరులు, స్నేహితులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. యడ్లపల్లి రామ్ సుధీర్‌తో పాటు స్థానిక జ‌న‌సేన నాయ‌కులు యడ్లపల్లి లోకేష్‌, పొల‌గాని ల‌క్ష్మీనారాయ‌ణ‌, మ‌ద్దాల ప‌వ‌న్‌, తోట జ‌గ‌దీష్‌, ప్ర‌సాద్‌లు జనసేన పార్టీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ నేతృత్వంలో ఈ చేరికలు జరగడం విశేషం.

Tags:    

Similar News