BIG News: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. వాళ్లకు ఇక నో ట్రాన్స్‌ఫర్స్

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-26 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 లోపు రిటైర్ కాబోయే ఉద్యోగులకు సర్కార్ తీపి కబుబు చెప్పింది. ఈ మేరకు వారందరినీ సాధార‌ణ బ‌దిలీల‌ నుంచి మిన‌హాయింపునిస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అందుకు సంబంధించి జీవో నెంబ‌ర్ 76తో కూడిన గెజిట్‌ కూడా విడుదలైంది. ప్రభత్వం త‌ర‌పున రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ పియూష్ కుమార్ ఆ గెజిట్‌ను విడుద‌ల చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల మంది లబ్ధి పొందనున్నారు. సినీయర్ ఉద్యోగుల ఆరోగ్యం, స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. 


Similar News