BIG BREAKING: వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీ సభ్యత్వానికి ఎంపీ మోపిదేవి రాజీనామా

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Update: 2024-08-28 07:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లలో విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు, కేడర్ నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో వైపు పార్టీలో ఇన్నాళ్లు కీలక వ్యవహరించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొంత కాలంగా నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో మోపిదేవి భేటీ అయ్యారు. రేపు వైసీపీ రాజీనామా చేసి, త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నారు.  


Similar News