వరద బాధితులకు భారత్ బయోటెక్ భారీ విరాళం

భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీకి భారత్ బయోటెక్ భారీ విరాళాన్ని ప్రకటించింది.

Update: 2024-09-04 14:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీకి భారత్ బయోటెక్(Bharat Biotech) భారీ విరాళాన్ని ప్రకటించింది. వరదల్లో చిక్కుకొని విలవిలలాడిన ప్రజలను చూసి గుండె తరుక్కు పోయిందన్న భారత బయోటెక్ ఎగ్జిగ్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా.. త్వరలోనే ఏపీలో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తెలిపారు. ఏపీలోని వరద బాధితులకు తమ వంతు సహాయంగా రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమచేసినట్టు కంపెనీ ఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు.   


Similar News