ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-25 16:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలో అయ్యన్నపాత్రుడు పాల్గొని, ప్రసంగించారు. తనకు రాజకీయాల్లో ఏమీ తెలియనపుడే, నాకంటే పలువురు సీనియర్లు ఉన్నపుడు కూడ ఎన్టీఆర్ నన్ను నమ్మి మంత్రి పదవి ఇచ్చారని కొనియాడారు. కాని ఎన్టీఆర్ ను మాత్రం అలా ఎవ్వరూ నమ్మలేదని, తన స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగారని అన్నారు. ఎన్టీఆర్ చేసిన ఎన్నో గొప్ప చిత్రాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టరాని, కేవలం పాత్రలు వేయడమే కాదు.. బయట కూడా కుటుంబ విలువలు పాటించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని పొగిడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందు ఉండేవారని, తరువాతి తరాలకు ఎన్టీఆర్ గొప్పతనం తెలిజేయాలని అయ్యన్నపాత్రుడు కోరారు. భారతరత్న పొందగల అన్ని అర్హతలు ఎన్టీఆర్ కు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరతామని పేర్కొన్నారు. 


Similar News