Breaking: వితంతువుపై వైసీపీ రౌడీమూకల దాడి..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (X) వేదికగా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-02-21 07:19 GMT

దిశ డైనమిక్ బ్యూరో:  తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (X) వేదికగా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపట్ల ఏపీ ప్రభ్యత్వ తీరును ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ చేశారు.  వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న గళాలపై దాడులను, అరాచకానికి వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయిందని ఆవేదన వ్యాక్యతం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంది ఇలాంటి రాచకాలను పోత్సహించడం సబబు కాదని తెలిపారు. 

తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన తనను  తీవ్రంగా కలిచివేసింది తన భావోద్వేగంగా పోస్ట్ లో రాసారు. భర్త లేకపోయినా.. దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా దాడులు నిత్యకృత్యం అయిన మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటి చూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని.. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని.. అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.

Tags:    

Similar News