AP News:టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి..ప్రభుత్వం కీలక ఆదేశాలు!

గత వైసీపీ ప్రభుత్వ హయంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పై 2021, అక్టోబర్ 19న వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

Update: 2024-07-08 14:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ హయంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పై 2021, అక్టోబర్ 19న వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పట్లో జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు విమర్శించారు. సీసీ ఫుటేజీ, టోల్ ప్లాజా వద్ద సేకరించిన సమాచారంతో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించారు. పలువురు వైసీపీ కీలక నేతలపై కేసు నమోదు చేశారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనకు సంబంధించి విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో ప్రజాప్రతినిధులు వేర్వేరు జిల్లాలకు చెందిన వారు ఉండటంతో సిట్ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.


Similar News