అంగళ్లు ఘటనపై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

అంగళ్లు ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Update: 2023-10-12 09:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అంగళ్లు ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అంగళ్లు ఘటనలో సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇకపోతే అన్నమయ్య జిల్లాలో అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం అంగళ్లు, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈకేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్లను గత సోమవారం హైకోర్టు తిరస్కరించింది. అంగళ్లు కేసులో డీమ్డ్‌ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులు మరోసారి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తునకు తన క్లయింట్ సహకరిస్తానని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అంగళ్లు కేసులో అక్టోబరు 12 వరకు అరెస్టు చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి విచారణను శుక్రవారంకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. 

Tags:    

Similar News