AP:చర్చనీయాంశంగా బాలీవుడ్ నటి కేసు వ్యవహారం..వేళ్లన్నీ ఆ పోలీసుల వైపే?

ఏపీ రాజకీయాల్లో నటి జత్వాని కేసు వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆమె ఓ హోటల్‌లో బస చేశారు.

Update: 2024-08-30 11:02 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో:ఏపీ రాజకీయాల్లో నటి జత్వాని కేసు వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆమె ఓ హోటల్‌లో బస చేశారు. ఆమెను ఈ మధ్యాహ్నం విచారణ అధికారి స్రవంతి రాయ్ కలవనున్నారు. ప్రస్తుతం తన లీగల్ టీంతో నటి చర్చలు జరుపుతున్నారు. అనంతరం వారంతా కలిసి విజయవాడ సీపీని కలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అక్రమ నిర్బంధం, మహిళా సిబ్బంది లేకుండా ఇక్కడికి తీసుకొని రావడం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు.

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెబితేనే ఇలా తీసుకు వచ్చినట్లు కింద స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఈ కేసు వెనుక పెద్దలు ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు, ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూడా సీరియస్ గా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒకరిద్దరు అధికారులను ఉన్నతాధికారులు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే అంశం త్వరలో తేలనుంది. ఇప్పటికే ముగ్గురు సీనియర్​ ఐపీఎస్​ అధికారుల పై ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. కింది స్థాయి అధికారులు ఎవరు ఉన్నారు..? ఎవరి కోసం ఇదంతా చేశారు అనే విషయాలు విచారణలో తేలనుంది.


Similar News