పార్లమెంటులో అరకు కాఫీ ఘుమ ఘుమలు
పార్లమెంటు ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాల్ ను ఈరోజు ప్రారంభించారు.

దిశ డైనమిక్ బ్యూరో: పార్లమెంటు ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాల్ ను ఈరోజు ప్రారంభించారు.లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాజరైన గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. తొలుత అరకు కాఫీ ఉత్పత్తులను లోక్సభ స్పీకర్కు మంత్రి సంధ్యారాణి అందజేశారు.