కర్ణాటకలో బోల్తాపడ్డ ఏపీఆర్టీసీ బస్

కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

Update: 2024-08-11 16:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బెంగుళూరు నుండి పుట్టపర్తి వస్తుండగా బాగేపల్లి మండలం చండూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం పెద్దగా జరగకపోయినా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన చండూరు గ్రామస్తులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.     


Similar News