ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. రూ.252.42 కోట్ల నిధులు మంజూరు

అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Update: 2024-10-24 13:07 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్దిసేపటికే కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరో శుభవార్త రాష్ట్రానికి అందించింది. రణస్థలం ఎలివేటెడ్‌ కారిడార్‌( Ranasthalam elevated corridor) అభివృద్ధికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా.. ఈ కారిడార్ ను..ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.252.42 కోట్ల నిధులు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(Minister Nitin Gadkari) మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎలివేటెడ్‌ కారిడార్‌( Ranasthalam elevated corridor) అభివృద్ధికి కేంద్ర ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర మంత్రులు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ సహకారం పై ప్రశంసలు కురిపించారు.


Similar News