తెలంగాణలో భారీ వర్షాలు..వరదల్లో చిక్కుకున్న ఏపీ ఎమ్మెల్యే?

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-01 09:41 GMT

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఏపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహబూబాబాద్‌లో చిక్కుకుపోయారు. నెల్లూరు నుంచి సికింద్రాబాద్‌కు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కేసముద్రం, నెక్కొండ మధ్యలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. వరద నీటి ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మార్గంలో ప్రయాణించే రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబాద్ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నిలిపివేయడంతో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి అక్కడే చిక్కుకుపోయారు. వెంటనే ఆయన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికంగా ఓ నేత ఇంట్లో ఏపీ ఎమ్మెల్యేకు బస ఏర్పాటు చేశారు.


Similar News